Skip to main content

రెడ్‌మి, లెనోవా ఫోన్‌లు అంతచౌకగా ఎలా అమ్ముతున్నారో తెలుసా!


రెడ్‌మి(షియామి), లెనోవా, జియానీ, లీకో, హ్వావేయ్(హువావే అని కూడా పిలుస్తారు), కూల్‌ప్యాడ్ వంటి చైనా కంపెనీల మొబైల్ ఫోన్‌ల మోడల్స్ భారత్‌లో అత్యధిక సంఖ్యలో అమ్ముడుపోతున్న సంగతి తెలిసిందే. మంచి కాన్ఫిగరేషన్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఉన్న పవర్‌ఫుల్ ఫోన్లను శాంసంగ్, సోనీ, ఎల్‌జీ, హెచ్‌టీసీ వంటి బడా కంపెనీల ఫోన్ల ధరలలో మూడోవంతుకే అందిస్తుండటంతోనే పైన పేర్కొన్న చైనా కంపెనీల ఫోన్‌లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా రెడ్‌మి సంస్థ ఫోన్‌లు భారతీయుల హృదయాలను కొల్లగొట్టి వారి జేబుల్లో తిష్ఠవేసుకుని కూర్చున్నాయి. రెడ్‌మి నోట్ 3, రెడ్‌మి 3ఎస్, రెడ్‌మి 3 ప్రైమ్ మోడల్స్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మొబైల్ ఫోన్లుగా ఇటీవల రికార్డులకెక్కాయి. ఈ మోడల్స్‌లోని స్పెసిఫికేషన్స్‌తోనే శాంసంగ్, సోనీ, ఎల్‌జీ కంపెనీల ఫోన్లను కొనాలంటే మూడింతలు ఎక్కువ డబ్బు పెట్టాల్సిఉంటుంది(రెడ్‌మి రెండేళ్ళ క్రితం తయారుచేసిన మోడల్స్‌లో స్నాప్ డ్రాగన్ 400, స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్‌ను వాడగా, అదే ప్రాసెసర్‌లతో తయారుచేసిన మోడల్స్‌ను శాంసంగ్ ప్రస్తుతం 15-20 వేల రేంజిలో అమ్ముతోంది). మరి ఈ చైనా కంపెనీలు ఇంత కారుచౌకగా ఎలా అమ్ముతున్నాయన్నదే ఆసక్తికరమైన అంశం. పూర్తి కథనం చదవటానికి  ఇక్కడ క్లిక్ చేయండి. 

Comments

Popular posts from this blog

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

ఏపీలో ఏ వర్గం ఓట్లు ఎటువైపు? తటస్థ ఓటర్ల మద్దతు జగన్‌కా, కూటమికా?

  ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు. ఎందుకంటే బీసీలు అంటే యాదవ, గౌడ, శెట్టిబలిజ, పద్మశాలి, మత్స్యకార వంటి అనేక వెనుకబడిన కులాల సమాహారం. రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీలలాగా బీసీలను ఒక్కటిగా కనెక్ట్ చేసే యూనిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బీసీలపై ప్రేమ వలనో, వారి ఓట్లపై ప్రేమవలనోగానీ, జగన్మోహన్ రెడ్డి వారికి ఈ ఎన్నికల్లో వారికి పెద్దపీట వేశాడు. కొన్నిచోట్ల తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి రెడ్లుకు కాకుండా బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని...