తెలుగు
సినీరంగమూలస్తంభాలలో ఒకరైన
అక్కినేని నాగేశ్వరరావు
మరణించారన్నవార్తతో ఈ ఉదయంనుంచి
రాష్ట్రంలోని ప్రతిఇంటా
ఒకరకమైన విషాదం అలుముకుంది.
ప్రతివారూ
తమ ఇంట్లోని వ్యక్తి ఎవరో
చనిపోయినట్లు విచారిస్తున్నారంటే
దానికి కారణం ఆరు దశాబ్దాలుగా
అక్కినేని ఆయా తరాలపైవేసిన
ముద్రే అని చెప్పాలి.
ముఖ్యంగా
ప్రస్తుతం 40
సంవత్సరాలు,
ఆ పైన వయస్సులో
ఉన్న తెలుగువారందరూ అక్కినేని
చిత్రాలు చూస్తూ పెరిగినవారే
కావటంతో వారందరి జీవితం,
సంస్కృతిలో
ఆయన ఒక భాగమైపోయారు.
ఈ కారణాలన్నిటిరీత్యా
అక్కినేని మరణవార్త వారిని
విచారానికి గురిచేసింది.
అందుకే ఆయన
భౌతిక కాయం చూడటానికి అన్నపూర్ణ
స్టూడియోకు సినీపరిశ్రమవారు,
వీఐపీలు,
బంధువులకంటే
సామాన్యజనమే ఎక్కువమంది
తరలివస్తున్నారు.
ఉదయంనుంచీ
దాదాపుగా ఇళ్ళలో ఉన్నవారందరూ
వివిధ టీవీ ఛానళ్ళలోఅక్కినేని
మృతిపైవస్తున్న లైవ్
కార్యక్రమాలను కళ్ళప్పగించి
చూస్తున్నారు.
ముఖ్యంగా
నాగార్జున మధ్యమధ్యలో కంటినీరు
పెట్టుకుంటుడటం,
సంబాళించుకుని
వచ్చేవారిని పలకరించటం,
అక్కినేని
కుటుంబసభ్యులందరూ ఎటూ వెళ్ళకుండా
భౌతికకాయంవద్దే నిలబడిఉండటం
టీవీలు చూస్తున్నవారందరినీ
కదిలిస్తున్నాయి.
అక్కినేనికి
నివాళులు అర్పించటానికి
సినీ,
రాజకీయ ప్రముఖులు
పెద్దఎత్తున తరలి వస్తుండటంతో
టీవీలు చూస్తున్నవారికి
విచారంలో కాస్త ఊరట లభించినట్లయింది.
మరోవైపు
ఏవీఎస్తో మొదలుపెట్టి,
శ్రీహరి,
ధర్మవరపు,
ఉదయకిరణ్,
వడ్డే రమేష్,
అంజలీదేవి,
ఈవీవీగిరి...ఇప్పుడు
అక్కినేని -
ఇలా వరసగా
చనిపోతుండటంతో తెలుగు
సినీపరిశ్రమవారు హడలిపోతున్నారు.
ముఖ్యంగా
పరిశ్రమకు చెందిన వయోవృద్ధులు
తర్వాత తమవంతేమోనన్న భయంతో
కన్నీరుమున్నీరవుతున్నారు.
Image courtesy:wikipedia
Comments
Post a Comment