Skip to main content

నోకియాకు చుక్కలు చూపిస్తున్న గూగుల్, ఏపిల్


మొబైల్ ఫోన్ల మార్కెట్‌లో ఏళ్ళతరబడి రారాజుగా చెలామణీ అయిన నోకియా మార్కెట్ గణనీయంగా పడిపోయింది. మరోవైపు శ్యాంసంగ్, సోని ఎరిక్సన్ కంపెనీలు విపరీతంగా పుంజుకున్నాయి. ఈ పరిణామానికి కారణం స్వయంకృతాపరాధమని తెలుసుకున్న నోకియా పూర్వ ప్రాభవాన్ని సంతరించుకోవడానికి దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

సెల్ ఫోన్ అంటేనే నోకియా అనే స్థాయిలో ఆ కంపెనీ ప్రస్థానం ప్రారంభమయింది. ఫిన్లాండ్ దేశానికి చెందిన ఈ కంపెనీ దాదాపు ఒకటిన్నర దశాబ్దాలపాటు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే రెండేళ్ళుగా ఆ కంపెనీ అమ్మకాలు తిరోగమనదిశలో సాగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం గూగుల్ కంపెనీ సెల్ ఫోన్లకోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆండ్రాయిడ్ ఓఎస్‌తో మొబైల్ ఫోన్ల ఉపయోగంలో ఎన్నో సానుకూల, విప్లవాత్మక మార్పులు రావడంతో అందరూ దానిపట్ల ఆకర్షితులయ్యారు. దీనిని గమనించిన శ్యాంసంగ్ కంపెనీ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పలు మోడల్స్‌ను మార్కెట్లోకి దించింది. సోని ఎరిక్సన్, మోటరోలా తదితర కంపెనీలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించాయి. కానీ మార్కెట్ నంబర్ వన్‌గాఉన్న నోకియామాత్రం ఈ పరిణామాన్ని లైట్ తీసుకుంది. ఏళ్ళతరబడి తమ ఫోన్లలో అమర్చుతున్న సింబియన్ ఓఎస్‌నే కొనసాగించింది. ఆండ్రాయిడ్‌లో ఉన్న యూజబిలిటీ సింబియన్‌లో లేకపోవడంతో నోకియాకు ఆదరణ క్రమంగా తగ్గిపోయింది. విండోస్, అన్నా ఆపరేటింగ్ సిస్టమ్‌లతో కొన్ని మోడళ్ళను విడుదల చేసినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకపోయింది.

అటు, ఏపిల్ కంపెనీ తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌ iosతో ఐఫోన్లను మార్కెట్లోకి దించడం కూడా నోకియాకు తీవ్ర విఘాతంగా మారింది. నోకియా హైఎండ్ ఫోన్లు, ఏపిల్ ఐఫోన్లకు ఏమాత్రం సరితూగలేకపోయాయి. ఐఫోన్లలోని ఫీచ‌ర్స్‌ వాడకందార్లకు విపరీతంగా నచ్చుతుండటంతో ఆ ఫోన్లకోసం జనం, ముఖ్యంగా యువత వేలంవెర్రిగా ఎగబడుతున్నారు. నోకియా హైఎండ్ మోడళ్ళలో నాలుగేళ్ళక్రితం వచ్చిన N95 తప్పితే, తర్వాత వచ్చిన ఏ ఒక్కటీ ప్రజాదరణకు నోచుకోలేకపోయింది.

గూగుల్, ఏపిల్ కంపెనీల ఉత్పత్తులను ఎదుర్కోవడంకోసం నోకియా తాజా వ్యూహాలతో, కొత్తకొత్త ఫీచర్లతో, విండోస్ 7.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇటీవలే ల్యూమియా 800అనే మోడల్ దించింది. ఇది ఎంతవరకు ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.

మరోవైపు డ్యూవల్ సిమ్ మార్కెట్ పట్ల నిర్లక్ష్యం వహించడంకూడా నోకియా అమ్మకాలను దెబ్బతీసింది. అటు శ్యాంసంగ్ కంపెనీమాత్రం డ్యువల్ సిమ్ మోడళ్ళను పెద్దసంఖ్యలో విడుదల చేసి మార్కెట్‌ను చేజిక్కించుకుంది. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న నోకియా, ఇప్పుడు డ్యువల్ సిమ్ మార్కెట్లోకి పెద్ద ఎత్తున మోడళ్ళను దించుతోంది.

స్థానిక, చైనా కంపెనీల ప్రభావంకూడా నోకియాపై తీవ్రంగా ఉంది. మైక్రోమ్యాక్స్, కార్బన్ వంటి స్థానిక కంపెనీలు, చైనావారి నకిలీ ఉత్పత్తులు నోకియా అమ్మకాలను బాగా దెబ్బతీశాయి. మైక్రోమ్యాక్స్ వంటి స్థానిక కంపెనీలు కూడా ఆండ్రాయిడ్ ఓఎస్‌తో మోడళ్ళను దించి మార్కెట్టును ఎంతోకొంత చేజిక్కించున్నాయి.

బిజినెస్ ఫోన్ల క్యాటగరీలో అగ్రగామిగా చెలామణీ అయిన బ్లాక్‌బెర్రీ కంపెనీకూడా నోకియాలానే తిరోగమన దిశలో ఉండటం మొబైల్ ఫోన్ల మార్కెట్లో మరో విశేషం. పరిస్థితిని పునరుద్ధరించడంకోసం ఆ కంపెనీకూడా చర్యలు చేపట్టింది ఇటీవల తన ఫోన్ల ధరలను రెండు విడతలుగా తగ్గించింది.

Comments

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.